బాలీవుడ్ అందాలతార కరీనా కపుర్ ఇంట్లో సుమారు రూ. 2లక్షల విలువ చేసే బంగారు ఆభరణం మిస్సయిందట. ఆ సమయంలో కరీనా విదేశాల్లో ఉంది. ముంబయ్ రాగానే ఆమె తల్లి ఈ విషయాన్ని కరీనాకు చేరవేసింది. కరీనా ఇంట్లో పది మంది వరకు పని చేస్తున్నారట. ఆ పదిమందినీ విచారిస్తే మాకు తెలియదని ఎవరికి వారు సమాధానం చెప్పారట. దీంతో ఆగ్రహించిన కరీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ముగ్గురు పనివాళ్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని తేలింది.
0 comments:
Post a Comment