దర్శకుడు కృష్ణవంశీ వివాదాలతో విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. 'మహాత్మ' సినిమా విషయంలో ఇప్పటికే అనవసరపు వివాదాలు రేగాయని, వీటికి ఇంతటితో ముగింపు పలికేతే బెటర్ అని కృష్ణవంశీ అన్నారు. మంగళవారం (October 20, 2009) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ వివాదాలపై స్పందించారు. తొలుత సెన్సార్ సమస్యలు, ఆ తర్వాత భజరంగ్ దళ్ సభ్యుల ఆందోళన, తాజాగా లాయర్ల అభ్యంతరాలు, .. ఇలా ఒక్కో వివాదం మహాత్మని చుట్టుముట్టుతుండడంతో కృష్ణవంశీ స్పందించాల్సి వచ్చింది. "దయచేసి మీడియా వాళ్ళు ఇంకా కొత్త వివాదాలు లేపొధ్దు ప్లీజ్" అంటూ చేతులు జోడించారు
0 comments:
Post a Comment