మోనాలిసా పెయింటింగ్ ఎంత పాపులరో చెప్పక్కర్లేదు కదా. మరి ఆ కళాఖండాన్ని సృష్టించిన చిత్రకారుడు ఎవ్వరో తెలుసా? 16వ శతాబ్దానికి చెందిన Leonardo Da Vince. అయితే, 'ఏక నిరంజన్' సినిమాలో ఒక పాటలో మోనాలిసా బొమ్మని పికాసో గీసినట్లుగా రాసారు పాటల రచయిత భాస్కరభట్ల. 'మహమ్మారి..మహమ్మారి..అందాల మహామ్మరివే .. ' అనే పాటలో ' పికాసో నీకేసి ఆనాడే చూసి ఉంటె..మోనాలిసా పెయింటింగ్ మానేసి ఉంటాడే..' అని ఉంది. పాపం భాస్కరభట్లకి ఈ విషయం తెలియకపోయినా ఎంతో knowledge ఉన్న దర్శకుడు పూరి ఈ మిస్టేక్ని ముందే చూసి తొలగించి ఉంటే బావుండేది.
0 comments:
Post a Comment